వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
23న విశాఖ బంద్: కాంగ్రెస్
విశాఖపట్నం: విశాఖపట్నం నగరానికి గోదావరి జలాల మళ్ళింపును తక్షణమే చేపట్టాలని డిమాండ్ చేస్తూ నిర్వహిస్తోన్న ఆందోళనను కాంగ్రెస్ ఉధృతం చేసింది. ఆదివారం జలజాగృతి పేరిట నగరంలో భారీ నిరసన ర్యాలీని నిర్వహించింది. నగర మేయర్ రాజాన రమణి అధ్వర్యంలో నిర్వహించిన ఈ భారీ ర్యాలీకి పెద్ద సంఖ్యలో ప్రజలు హాజరయ్యారు.
ప్రభుత్వం తాత్సారం చేయకుండా గోదావరి జలాలనుమళ్ళించి, విశాఖ ప్రజల దాహార్తిని తీర్చాలని ఆమెఅన్నారు. తమ ఆందోళనను ఉధృతం చేయనున్నామని,దీనిలో భాగంగా ఈ నెల 23న నగర బంద్ నునిర్వహించనున్నామని ఆమె ప్రకటించారు.
Comments
Story first published: Sunday, January 19, 2003, 23:53 [IST]