వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
పల్నాడు వృద్దికి ప్రాణత్యాగం: కోడెల
గుంటూరు: అవసరమైతే పల్నాడు ప్రాంత అభివృద్ది కోసం తాను ప్రాణత్యాగానికి సైతం సిద్దమని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి కోడెల శివప్రసాదరావు ఆవేశంగా ప్రకటించారు. పల్నాడు వెనుబాటుతనాన్ని ఆసరా చేసుకొని నక్సల్స్ ఈ ప్రాంతంలో చెలరేగిపోతున్నారని ఆయన ఆదివారం గుంటూరులో జరిగిన విలేకరుల సమావేశంలో అన్నారు.
ఈ ప్రాంత అభివృద్ది కోసం తానుదేనికైనా సిద్దపడుతానని అన్నారు. నక్సల్స్ ఆగడాలవల్లే ఇక్కడ అభివృద్ది కుంటుపడుతోందని తెలిపారు.పల్నాడులో అశాంతి మూలంగా ప్రభుత్వ పథకాలు అమలుకు నోచుకోవడం లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. నక్సలైట్లకు దూరంగా ఉండాలని ఆ ప్రాంత ప్రజలకు ఆయన పిలుపునిచ్చారు.
Comments
Story first published: Sunday, January 19, 2003, 23:53 [IST]