వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రోప్‌ వే ప్రమాదం, 4గురి మృతి

By Staff
|
Google Oneindia TeluguNews

అహ్మదాబాద్‌: గుజరాత్‌ లో ఆదివారం జరిగిన రోప్‌ వేఘోర ప్రమాదంలో నలుగురు యాత్రికులు మరణించారు. పంచ్‌ మహల్స్‌ జిల్లాలోని సుప్రసిద్ద మహంకాళి ఆలయానికి యాత్రకు వెళుతుండగా ఈ దుర్ఘటన జరిగింది. పావన్‌ గఢ్‌పర్వతంపై ఉన్న ఆలయానికి వెళ్ళే రోప్‌ వేపై మూడు ట్రాలీలు మధ్యలోనే కుప్పకూలాయి. ఈ ఘటనలో ఒక మహిళ సహా నలుగురు అక్కడికక్కడే మరణించగా, మరో 18 మంది యాత్రికలు గాయపడ్డారు.

మరికొంతమంది ట్రాలీలలో చిక్కుకున్నారు. చిక్కకున్నవారిని సురక్షితంగా రక్షించేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. ఆర్మీ, వైమానికి రంగాలకు చెందిన సిబ్బంది సహాయక చర్యలు చేపడుతున్నారు. ముఖ్యమంత్రి నరేంద్ర మోడి హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ప్రమాదానికి కారణం ఇంకా తెలియరాలేదని ఆయనవిలేకరులకు తెలిపారు. దర్యాప్తు సాగిస్తున్నామని,విద్రోహ చర్య మాత్రం కాదని ఆయన తెలిపారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X