వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
పేలుడుతో పట్టాలు తప్పినరైలు
గౌహతి:
బాంబు
పేలడంతో
మధ్య
అస్సాంలోని
కర్బి
అంగ్లోంగ్
జిల్లాలో
డిబ్రుఘర్-
గౌహతి-
హౌరా
రైలు
సోమవారం
తెల్లవారుజామున
పట్టాలు
తప్పింది.
రైలుకు
చెందిన
మూడు
బోగీలు
పట్టాలు
తప్పాయి.
ఈ ప్రమాదంలో ప్రాణనష్టం సంభవించలేదు. ఖాళీగా ఉన్న జనరల్ కంపార్ట్మెంట్,పార్సల్ వ్యాన్, బ్రేక్ వ్యాన్ పట్టాలు తప్పాయి. దీంతో ఎవరూ గాయపడలేదు. పేలుడు వల్ల బ్రాడ్గేజ్సెక్షన్లోని సింగిల్ లైన్ దెబ్బ తిన్నది. దిఫు నుంచి బయలుదేరిన కొద్దిసేపటికే సోమవారం తెల్లవారు జామున ఒంటిగంటన్నర ప్రాంతంలో దిఫు నైలాలుంగ్స్టేషన్ల మధ్య ఈ రైలు పట్టాలు తప్పింది.
ట్రాక్స్పై మిలిటెంట్లు బాంబు పెట్టి వుంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. ప్రయాణికులను గమ్యస్థానాలకు చేర్చడానికి 60 బస్సులను రంగంలోకి దించారు. రిలీఫ్ వ్యాన్, మెడికల్ వ్యాన్ రంగంలోకి దిగాయి.
Comments
Story first published: Monday, January 20, 2003, 23:53 [IST]