ఉగ్రవాదానికి పాక్ కేంద్రం: వాజ్పేయి
పోర్ట్బ్లెయిర్:
ఉగ్రవాద
కార్యకలాపాలకు
పాకిస్థాన్
కేంద్రంగా
మారిందని
ప్రధాని
అటల్
బిహారీ
వాజ్పేయి
విమర్శించారు.
అయినప్పటికీ
ఈ
దేశంపై
ఏ
విధమైన
చర్యలూ
తీసుకోవడం
లేదని
ఆయన
అన్నారు.
పాకిస్థాన్
కార్యకలాపాలను
అణచివేయాలని
ఆయన
అంతర్జాతీయ
సమాజానికి
పిలుపునిచ్చారు.
మూడు
రోజుల
పర్యటనను
ముగించుకుని
సోమవారం
ఢిల్లీకి
బయలుదేరే
ముందు
ఆయన
విలేకరులతో
మాట్లాడారు.
ఇరాక్ సంక్షోభం తర్వాత ఉగ్రవాద వ్యతిరేక పోరులో అంతర్జాతీయ సమాజం లక్ష్యం పాకిస్థానే అవుతుందని పాకిస్థాన్ అధ్యక్షుడుపర్వేజ్ ముషార్రఫ్ చేసిన ప్రకటనను విలేకరులు ప్రస్తావించగా ఆయన ఆ విధంగా అన్నారు. పాకిస్థాన్కు ప్రపంచంలోని ఇతర ప్రాంతాల్లో గల ఉగ్రవాదులతో సంబంధాలున్నాయని,అయినప్పటికీ ఏ విధమైన చర్యలు తీసుకోవడం లేదని, పాకిస్థాన్ ద్వారా పెరుగుతున్న ఉగ్రవాదాన్ని అణచివేయాలని అంతర్జాతీయ సమాజంలోని మిత్రులను కోరుతున్నామని వాజ్పేయి అన్నారు.