వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
తుమ్మలఆవేశపూరిత ఆరోపణలు
హైదరాబాద్: కోస్తా రహదారిపై జరుగుతోన్న రగడ భారీ నీటిపారుదల శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వ్యాఖ్యలతో కొత్త మలుపు తిరిగింది. సోమవారం హైదరాబాద్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో తుమ్మల కాంగ్రెస్ పై ఆవేశపూరితంగా చేసిన ఆరోపణలు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
కాంగ్రెస్ నాయకులపై విమర్శలు చేస్తూ ఆయన వాళ్ళ బాబులు.. అని గోదావరి యాసలో ఆయన చేసిన వ్యాఖ్యలపట్ల కాంగ్రెస్ నాయకులు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఒక పార్టీని విమర్శించేముందు భాషను కంట్రోల్ చేసుకోవాలని రాష్ట్ర కాంగ్రెస్ సీనియర్ నేత ఒకరు వ్యాఖ్యానించారు. బందర్ లో అమరణ దీక్ష చేస్తోన్న వారిని వాడు..వీడు.. అని సంబోధిస్తూ ఆయన విమర్శలు గుప్పించడంపై టీడీపీ నేతలు కూడా తప్పుబడుతున్నారు.
Comments
Story first published: Monday, January 20, 2003, 23:53 [IST]