వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
అప్పులు తేవడం తప్పదు: యనమల
హైదరాబాద్: 2005 వరకు రాష్ట్రప్రభుత్వం అప్పులు తీసుకురావడం తప్పదని ఆర్థిక శాఖ మంత్రి యనమల రామకృష్ణుడు తెలిపారు. బుధవారం 2003- 2004 ముసాయిదా బడ్జెట్ విడుదల సందర్భాన్ని పురస్కరించుకొని మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడారు.
పెరుగుతోన్న అప్పుల భారాన్ని ఎలా నియంత్రించనున్నారన్న ప్రశ్నకు బదులిస్తూ..అప్పులు అభివృద్ధి కోసమే చేస్తున్నాం. కాబట్టి మరో రెండేళ్ళు ఇంకా అప్పులు చేయకతప్పదని తెలిపారు. ఈ ఏడాది 54 వేల కోట్ల రూపాయలు అప్పు చేయనున్నారు.
అయితే, ఈ రుణాన్ని అనుత్పాదక రంగాల్లో పెట్టుబడి పెట్టడం లేదని వివరించారు. అప్పు తేవడం తప్పక పోయినా, తగ్గించుకునేందుకు అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.
Comments
Story first published: Tuesday, January 21, 2003, 23:53 [IST]