వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సింగరేణి కార్మికులకు రేణుకా మద్దతు

By Staff
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌: సింగరేణి కాలరీస్‌ లో సమ్మెకు దిగిన కార్మికులకు కాంగ్రెస్‌ ఎంపీ రేణుకా చౌదరి బహిరంగంగా మద్దతు పలికారు. సమ్మెలో ఏఐటియూసీ కార్మికులు చురుగ్గా పాల్గొనడం ప్రధాన కారణం. సింగరేణి కార్మికుల న్యాయపరమైన కోరికలు గురించి ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆమె బుధవారం విలేకరులతో అన్నారు.

ప్రజాస్వామ్యంలో కార్మికులకు డిమాండ్‌ చేసే హక్కు ఉంటుంది. దాన్ని ప్రభుత్వం చర్చల ద్వారా పరిష్కరించుకోవాలి. ఏకపక్షంగా ముగ్గురు మంత్రుల కమిటీ పరిమితులు విధించి చర్చలు జరపాలని అంటే ఎలా అని ఆమె ప్రశ్నించారు.

మరోవైపు, సమ్మెకు దిగిన కార్మిక నేతల వైఖరిపై ముఖ్యమంత్రి అసంతృప్తి వ్యక్తం చేశారు. సింగరేణి కాలరీస్‌ ను దేశంలోనే ఆదర్శవంతంగా తీర్చిదిద్దే ప్రయత్నంలో ఉండగా, కార్మికులు తొందరపడి అభివృద్దిని కుంటుపడేలా చేస్తున్నారని ఆయన అన్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X