ఉపాధిపై శ్వేతపత్రానికి డిమాండ్
హైదరాబాద్:
రాష్ట్రంలోని
నిరుద్యోగ
పరిస్థితిపై,
ఉపాధి
కల్పనపై
శ్వేతపత్రం
ప్రకటించాలని
ఎఐసిసి
కార్యదర్శి
వి.హన్మంతరావు
డిమాండ్
చేశారు.
ఈ
మేరకు
హన్మంతరావుతో
నాయకత్వంలోని
ప్రతినిధి
బృందం
బుధవారం
గవర్నర్
సుర్జీత్
సింగ్
బర్నాలను
కలిసి
ఒక
వినతిపత్రం
సమర్పించింది.
ఉపాధి కొరవడడంతో యువకులు తీవ్రవాదం వైపు మొగ్గు చూపుతున్నారని హన్మంతరావు అన్నారు. ఏడాదికి కోటి ఉద్యోగాలు కల్పిస్తామని కేంద్ర ప్రభుత్వం హామీ ఇచ్చిందని, ఈ లెక్కన రాష్ట్రంలో ఏడాది ఏడు లక్షల మందికి ఉపాధి లభించాలని, ఈ హామీ ఇచ్చి ఇప్పటికే మూడేళ్లు గడిచాయని, ఉపాధి అవకాశాలు పెంచిన సూచనలు లేవని ఆయన అన్నారు.
ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ రిక్రూట్మెంట్లు ఆగిపోయాయని ఆయన చెప్పారు. ఈ స్థితిలో యువకులు నక్సలిజం వైపు, ఇతర తీవ్రవాద కార్యకలాపాల వైపు వెళ్తున్నారని, ఇది సామాజిక ఆర్థఙక సమస్యగా పరిణమిస్తోందని ఆయన అన్నారు.