వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
దావోస్ చేరుకున్న చంద్రబాబు
హైదరాబాద్: స్విట్జర్లాండ్ లోని దావోస్ నగరంలో ప్రపంచ ఆర్థిక సదస్సు గురువారం ప్రారంభం అయింది. ఈ సమావేశంలో పాల్గొనేందుకు బయలుదేరి వెళ్ళిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దావోస్ కు చేరుకున్నారు. కేంద్ర ఆర్థిక శాఖమంత్రి జశ్వంత్ సింగ్ అధ్వర్యంలో భారత బృందం ఈ సదస్సులో పాల్గొంటుంది.
అన్ని దేశాలకు తిరిగి పెట్టుబడులు ఆహ్వానించే బదులు అన్ని దేశాలకు చెందిన ఆర్థికవేత్తలు, పారిశ్రామిక వేత్తలు హాజరయ్యే ఈ సమావేశానికి వెళ్ళడం సబబని ముఖ్యమంత్రి అన్నారు. చంద్రబాబు మలేషియా ప్రధాని మహతీర్ మహమ్మద్ తో చర్చలు జరిపే అవకాశం ఉంది. కర్ణాటక ముఖ్యమంత్రి ఎస్.ఎం.కృష్ణ కూడా ఈ బృందంలో ఉన్నారు.
Comments
Story first published: Thursday, January 23, 2003, 23:53 [IST]