వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఎన్‌కౌంటర్‌- ముగ్గురు నక్సల్స్‌ హతం?

By Staff
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌: ఆయుధ డంప్‌ను స్వాధీనం చేసుకున్న సందర్భంగా నిషిద్ధ పీపుల్స్‌వార్‌ నక్సలైట్లకు, పోలీసులకు మధ్య ఎన్‌కౌంటర్‌ జరిగినట్లు ఇక్కడికి సమాచారం అందింది. బుధవారం రాత్రి ఎనిమిది గంటల ప్రాంతంలో ఈ ఎన్‌కౌంటర్‌ జరిగినట్లు చెబుతున్నారు. ఇందులో ముగ్గురు నక్సలైట్లు మరణించినట్లు కూడా ప్రచారం జరుగుతోంది.

అయితే ఎన్‌కౌంటర్‌ ఏదీ జరగలేదని పోలీసు ఉన్నతాధికారులంటున్నారు. పోలీసులు బుధవారం సాయంత్రం పీపుల్స్‌వార్‌కు చెందిన రెండు లారీ ఆయుధ డంప్‌ను స్వాధీనం చేసుకున్నారు. కర్నూలు జిల్లా శ్రీశైలం- దోర్నాల ఘాట్‌ పరిధిలోని నల్లమల అటవీ ప్రాంతంలో ఈ డంప్‌ను పోలీసులు కనిపెట్టారు. నక్సలైట్ల కోసం కర్నూలు, నల్లగొండ, మహబూబ్‌నగర్‌, ప్రకాశం జిల్లాల్లో పోలీసులు పెద్ద యెత్తున కూంబింగ్‌ చేపట్టారు. ఈ సందర్భంగా ఈ డంప్‌ బయటపడింది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X