వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
ఎన్కౌంటర్- ముగ్గురు నక్సల్స్ హతం?
హైదరాబాద్:
ఆయుధ
డంప్ను
స్వాధీనం
చేసుకున్న
సందర్భంగా
నిషిద్ధ
పీపుల్స్వార్
నక్సలైట్లకు,
పోలీసులకు
మధ్య
ఎన్కౌంటర్
జరిగినట్లు
ఇక్కడికి
సమాచారం
అందింది.
బుధవారం
రాత్రి
ఎనిమిది
గంటల
ప్రాంతంలో
ఈ
ఎన్కౌంటర్
జరిగినట్లు
చెబుతున్నారు.
ఇందులో
ముగ్గురు
నక్సలైట్లు
మరణించినట్లు
కూడా
ప్రచారం
జరుగుతోంది.
అయితే ఎన్కౌంటర్ ఏదీ జరగలేదని పోలీసు ఉన్నతాధికారులంటున్నారు. పోలీసులు బుధవారం సాయంత్రం పీపుల్స్వార్కు చెందిన రెండు లారీ ఆయుధ డంప్ను స్వాధీనం చేసుకున్నారు. కర్నూలు జిల్లా శ్రీశైలం- దోర్నాల ఘాట్ పరిధిలోని నల్లమల అటవీ ప్రాంతంలో ఈ డంప్ను పోలీసులు కనిపెట్టారు. నక్సలైట్ల కోసం కర్నూలు, నల్లగొండ, మహబూబ్నగర్, ప్రకాశం జిల్లాల్లో పోలీసులు పెద్ద యెత్తున కూంబింగ్ చేపట్టారు. ఈ సందర్భంగా ఈ డంప్ బయటపడింది.
Comments
Story first published: Thursday, January 23, 2003, 23:53 [IST]