భారత హైకమిషన్ సిబ్బంది బహిష్కరణ
ఇస్లామాబాద్: భారత్ తీసుకున్న చర్యకు పాకిస్థాన్ కూడా ప్రతీకార చర్య తీసుకొంది. పాకిస్థాన్ దౌత్య సిబ్బందిని భారత్ బహిష్కరించిన మరుసటి రోజే పాకిస్థాన్ కూడా ముగ్గురు దౌత్యవేత్తలను బహిష్కరించింది. భారత హైకమిషన్ కు చెందిన నలుగురు సిబ్బందితో పాటు ముగ్గురు దౌత్యవేత్తలను దేశం నుంచి బహిష్కరిస్తున్నట్లు గురువారం పాకిస్థాన్ ప్రభుత్వం ప్రకటించింది.
దౌత్యపరమైన నిబంధనలకు విరుద్దంగా ప్రవర్తిస్తున్నందున వీరిని బహిష్కరిస్తున్నట్లు ప్రకటించింది. 48 గంటల్లోపు ఈ నలుగురు సిబ్బంది దేశం విడిచి వెళ్ళాలని పేర్కొంది.
భారత దౌత్య కార్యాలయ కౌన్సిలర్ విపిన్ హందా, ద్వితీయ కార్యదర్శులు ఆర్పీ సింగ్, వకిల్ రామ్ దాస్, మరో సిబ్బంది పి.ఎచ్. సుందరంలకు ఆదేశాలు జారీచేసినట్లు తెలుస్తోంది. భారత ప్రభుత్వం దీనిపై స్పందిస్తూ -పాక్ ఆరోపణలు అర్ధరహితం, నిరాధరమని పేర్కొంది.