వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
మలుపు తిరిగిన కోస్తారహదారి వివాదం!
హైదరాబాద్/విజయవాడ: ప్రస్తుతం వివాదాస్పదంగా మారిన కోస్తా రహదారి మల్లింపు వివాదం కొత్త మలుపు తిరగింది. ఈ వివాదం కులం రంగు పులుముకుంటోంది. శుక్రవారం వేదవ్యాస్ ను అరెస్ట్ చేయడంపై కాంగ్రెస్ ఎంపీ దాసరి నారయణరావు స్పందిస్తూ..వివాదాన్ని కులం రంగును రుద్దారు.
ముఖ్యమంత్రి ఈ దారి మల్లించడం కేవలం ఒక వర్గం వారికి ప్రయోజనాలను కాపాడడానికేనని ఆయన వ్యాఖ్యానించారు. కులం అనే అర్థంలోనే ఆయన వర్గం అనే పదాన్ని వాడడం విశేషం.
ముఖ్యమంత్రి, ఆయనకు వత్తాసు పలుకుతోన్న వర్గం వారికి అనుకూలించేలా ఈ దారిని మల్లిస్తున్నారని ఆయన తీవ్ర ఆరోపణ చేశారు. మరోవైపు, టీడీపీ నేతలు దీనిపై పెదవి విప్పడం లేదు. ప్రతిదాన్ని కులం దృష్టిలో ఆలోచించడం మానుకోవాలని మాత్రమే స్పందించారు.
Comments
Story first published: Friday, January 24, 2003, 23:53 [IST]