వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
సీఎం వచ్చాకే సింగరేణి పరిష్కారం
హైదరాబాద్: సింగరేణి కార్మికుల సమ్మె మరో కొద్ది రోజులు పాటు కొనసాగే అవకాశం కన్పిస్తుంది. ప్రస్తుతం దావోస్ పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తిరిగి వచ్చాకే దీనికి ఒక పరిష్కారం లభించే అవకాశం ఉంది. కోయగూడెం సర్ఫేస్ మైనర్ తొలగింపు విషయంలోనే ప్రధానంగా అభ్యంతరం వ్యక్తం అవుతుండడం, యజమాన్యం ఈ విషయంలో పట్టుసడలించకపోవడం- ప్రధానంగా చర్చలకు అడ్డంకిగా మారాయి.
మరోవైపు, విద్యుత్, బొగ్గు గనుల శాఖ మంత్రి కొత్తపల్లి సుబ్బారాయుడు నామామాత్రంగా ప్రతిరోజూ ప్రెస్ కాన్ఫరెన్స్ లు నిర్వహిస్తూ..పనిలోకి హాజరు కావలంటూ కార్మికులను మీడియా ద్వారా కోరుతున్నారు. కార్మికులతో స్వయంగా మాట్లాడకుండా ఆయన కార్మికులకు అభయహస్తం ప్రకటించడంపై విమర్శలు చెలరేగుతున్నాయి.
Comments
Story first published: Friday, January 24, 2003, 23:53 [IST]