రెండో హరిత విప్లవం: రాష్ట్రపతి
న్యూఢిల్లీ:
వ్యవసాయ
దిగుబడిని
పెంచేందుకు
రెండో
హరిత
విప్లవాన్ని
సాధించాలని
రాష్ట్రపతి
ఎ.పి.జె.
అబ్దుల్
కలామ్
పిలుపునిచ్చారు.
సేద్య
యోగ్యమైన
భూమి
తగ్గుతూ
దానికి
డిమాండ్
పెరుగుతున్న
ప్రస్తుత
తరుణంలో
రెండో
హరిత
విప్లవ
సాధించాలని
ఆయన
అన్నారు.
దేశ
పటిష్టతను,
దేశం
ఎదుర్కుంటున్న
సవాళ్లను
వివరిస్తూ
ఆయన
శనివారం
గణతంత్రదినోత్సవ
సందేశం
సాగింది.
దేశం ప్రజాతంత్ర సంప్రదాయలను పెంచి పోషిస్తోందని, ఎలక్ట్రానిక్ వార్ఫేర్ సామర్ధ్యంతో, శాంతి ప్రయోజనాలకు అణుశక్తి వినియోగంతో దేశం రక్షణ రంగం ఎంతో ప్రగతి సాధించిందని ఆయన అన్నారు. ఆహారధాన్యాల దిగుబడిని 2020 నాటికి 300 మిలియన్ టన్నులకు పెంచాల్సి వున్నదని ఆయన చెప్పారు. పారదర్శక పాలన విషయంలో ప్రభుత్వం సత్వర అభివృద్ధిని సాధిస్తోందని ఆయన అన్నారు.
సీమాంతర ఉగ్రవాదం పెచ్చరిల్లినప్పటికీ ప్రజాస్వామ్య సంప్రదాయాలను నిలబెట్టేందుకు ఎనలేని ధైర్యసాహసాలు ప్రదర్శించిన జమ్మూ కాశ్మీర్, గుజరాత్ ప్రజలను ఆయన అభినందించారు. శాస్త్రవేత్తలు సాధించిన ప్రగతిని ఆయన ప్రశంసించారు.