వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
వీరప్పన్తో ఎస్టిఎఫ్ ఎదురుకాల్పులు
బెంగుళూర్:
అడవిదొంగ
వీరప్పన్కు,
కర్ణాటక
స్పెషల్
టాస్క్ఫోర్స్
బలగాలకు
మధ్య
శుక్రవారం
రాత్రి
ఎదురుకాల్పులు
జరిగాయి.
కర్ణాటక,
తమిళనాడు
సరిహద్దుల్లోని
గోపీనాథం
అటవీ
ప్రాంతంలో
ఈ
ఎదురుకాల్పులు
చోటు
చేసుకున్నాయి.
వీరప్పన్
గ్యాంగ్
కూడా
ఈ
ఎదురుకాల్పుల్లో
పాల్గొన్నట్లు
సమాచారం.
శుక్రవారం అర్థరాత్రి వీరప్పన్ గ్యాంగ్ ఎస్టిఎఫ్ బలగాలపైకి కాల్పులు జరిపింది. ఎస్టిఎఫ్ ప్రతిగా ఎదురుకాల్పులు జరిపింది. దీంతో రెండు రాష్ట్రాల నుంచి అదనపు బలగాలకు అక్కడికి చేరుకుని ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టాయి. ఇరు వైపులా ప్రాణనష్టమేదైనా సంభవించిందా అనే సమాచారం తెలియడం లేదు. ఈ ఆపరేషన్కు సంబంధించిన సమాచారాన్ని ఎస్టిఎఫ్ గోప్యంగా ఉంచుతోంది.
Story first published: Saturday, January 25, 2003, 23:53 [IST]