వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

వీరప్పన్‌తో ఎస్‌టిఎఫ్‌ ఎదురుకాల్పులు

By Staff
|
Google Oneindia TeluguNews

బెంగుళూర్‌: అడవిదొంగ వీరప్పన్‌కు, కర్ణాటక స్పెషల్‌ టాస్క్‌ఫోర్స్‌ బలగాలకు మధ్య శుక్రవారం రాత్రి ఎదురుకాల్పులు జరిగాయి. కర్ణాటక, తమిళనాడు సరిహద్దుల్లోని గోపీనాథం అటవీ ప్రాంతంలో ఈ ఎదురుకాల్పులు చోటు చేసుకున్నాయి. వీరప్పన్‌ గ్యాంగ్‌ కూడా ఈ ఎదురుకాల్పుల్లో పాల్గొన్నట్లు సమాచారం.

శుక్రవారం అర్థరాత్రి వీరప్పన్‌ గ్యాంగ్‌ ఎస్‌టిఎఫ్‌ బలగాలపైకి కాల్పులు జరిపింది. ఎస్‌టిఎఫ్‌ ప్రతిగా ఎదురుకాల్పులు జరిపింది. దీంతో రెండు రాష్ట్రాల నుంచి అదనపు బలగాలకు అక్కడికి చేరుకుని ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టాయి. ఇరు వైపులా ప్రాణనష్టమేదైనా సంభవించిందా అనే సమాచారం తెలియడం లేదు. ఈ ఆపరేషన్‌కు సంబంధించిన సమాచారాన్ని ఎస్‌టిఎఫ్‌ గోప్యంగా ఉంచుతోంది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X