వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
ఖతామీ హైదరాబాద్ సందర్శన
హైదరాబాద్:
ఇరాన్
అధ్యక్షుడు
అబ్దుల్
మహ్మద్
ఖతామీ
అకస్మాత్తుగా
హైదరాబాద్
పర్యటనకు
వచ్చారు.
దేశ
గణతంత్ర
దినోత్సవాలకు
అతిథిగా
హాజరైన
ఖతామీ
చివరి
నిమిషంలో
హైదరాబాద్కు
వచ్చారు.
ఆయన
మంగళవారం
హైదరాబాద్లో
వివిధ
కార్యక్రమాల్లో
పాల్గొని
తిరిగి
వెళ్లారు.
రాష్ట్రం అందిస్తున్న ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ పాలన ఇతర దేశాలు ఆదర్శమని ఆయన కొనియాడారు. ఐటిలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సాధించిన ప్రగతిని ఆయన కొనియాడారు. హైదరాబాద్ ప్రజల జీవన స్థితిగతుల్లో ఎంతో మార్పు వచ్చిందని, ఇది ఇతర దేశాల ప్రజలకు స్ఫూర్తిదాయకమని ఆయన అన్నారు. ఖతామీ హైటెక్ సిటీని సందర్శించారు. ఆ ఇరాన్ కాన్సులేట్ కార్యాలయానికి కూడా వెళ్లారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడితో కొద్దిసేపు సమావేశమయ్యారు. చంద్రబాబుతో కలిసి రాజభవన్కు వెళ్లి గవర్నర్ సుర్జీత్ సింగ్ బర్నాలాను కలుసుకున్నారు.
Comments
Story first published: Tuesday, January 28, 2003, 23:53 [IST]