కాంగ్రెస్ జెండావందనంపై దుమారం
హైదరాబాద్:
రిపబ్లిక్
డేనాడు
జాతీయ
జెండాను
కాకుండా
పార్టీ
పతాకను
ఆవిష్కరించడంపై
రాష్ట్ర
కాంగ్రెస్
లోపల,
వెలుపల
తీవ్ర
దుమారం
చెలరేగుతోంది.
ఈ
విషయమై
సేవాదళ్
అధ్యక్షుడు
జనార్దన్
రెడ్డి
ప్రదేశ్
కాంగ్రెస్
కమిటీ
అధ్యక్షుడు
ఎం.
సత్యనారాయణరావుకు
ఒక
లేఖ
రాశారు.
రిపబ్లిక్ డేనాడు పార్టీ పతాక ఆవిష్కరణకు బాధ్యులైనవారిపై చర్య తీసుకునే అధికారం తమకు లేదని సత్యనారాయణరావు విలేకరులతో అన్నారు. ఈ విషయమై సేవాదళ్ అధ్యక్షుడు జనార్దన్ రెడ్డి తనకు ఓ లేఖ రాశారని, కొందరు సీనియర్ నాయకులు ఈ పని చేశారని ఆయన అన్నారని సత్యనారాయణ రావు చెప్పారు. తన నియామకం జరిగినప్పటి నుంచి తనపై కుట్రలు జరుగుతున్నాయని జనార్దన్ రెడ్డి అన్నారని ఆయన చెప్పారు. కొంత మంది సీనియర్ నాయకులు తనపై కూడా కుట్రలు చేస్తున్నారని ఆయన ఆరోపించారు.
రిపబ్లిక్ డేనాడు పొరపాటు జరిగిందని కాంగ్రెస్ అధికార ప్రతినిధి కె. రోశయ్య విలేకరులతో అన్నారు. అందుకు తాము చింతిస్తున్నామని ఆయన చెప్పారు. దీన్ని రాజకీయం చేయడం తెలుగుదేశం పార్టీకి తగదని ఆయన అన్నారు. ఆ రోజు జరిగిన సంఘటన జాతీయ జెండాను అవమానించడం కాదని ఆయన అన్నారు. ఈ వ్యవహారంపై విచారణకు పిసిసి అధ్యక్షుడు ఒక కమిటీ వేశారని ఆయన చెప్పారు.