వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అమెరికాకు వాజ్‌పేయి విజ్ఞప్తి

By Staff
|
Google Oneindia TeluguNews

అహ్మదాబాద్‌: ఇరాక్‌- అమెరికాసంక్షోభానికి యుద్ధం పరిష్కారం కాదని భారత ప్రధాని అటల్‌బిహారీ వాజ్‌పేయి అన్నారు. సంయమనం పాటించాలని ఆయన అమెరికా అగ్రరాజ్యానికివిజ్ఞప్తి చేశారు.

అహ్మదాబద్‌- వడొదర ఎక్స్‌ప్రెస్‌వేను ఆయన మంగళవారం ప్రారంభించారు. అమెరికా పేరెత్తకుండా అగ్రరాజ్యం ఏం చేస్తుందో నాకు తెలియదు. కానీ ప్రస్తుతం సంయమనం అవసరం అని ఆయన అన్నారు. ఆర్థిక వ్యవస్థను తీవ్రంగాదెబ్బ తీస్తుంది కాబట్టి ఐరోపాదేశాలు గానీ, ఇరాక్‌ ప్రజలు గానీ యుద్ధంకోరుకోవడం లేదని ఆయన అన్నారు.
భారత్‌ ఇరాక్‌తో పాటు పలు మధ్య ప్రాచ్య దేశాల నుంచి ఆయిల్‌ను కొనుగోలు చేస్తోందని,అందువల్లనే ఐక్య రాజ్య సమితి ద్వారా సంప్రదింపుల మార్గంలోసంక్షోభాన్ని పరిష్కారం చేసుకోవాలని కోరుతున్నామని ఆయన అన్నారు.

ఇరు దేశాల మధ్య యుద్ధం మొదలైతేపెట్రోలియం ఉత్పత్తుల ధరలు పెరుగుతాయని ఆయన హెచ్చరించారు. పట్ణణాలతో గ్రామాలను కలిపుతూ దేశమంతా రోడ్ల నెట్‌వర్క్‌ ఏర్పాటు చేయడం ప్రభుత్వ లక్ష్యమని ఆయన చెప్పారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X