విశాఖలో పట్టాలు తప్పిన గూడ్స్
విశాఖపట్నం:
విశాఖపట్నం
జిల్లాలో
బుధవారం
ఉదయం
ఒక
గూడ్స్
రైలు
పట్టాలు
తప్పింది.
ఎలమంచిలి-
రేగులపాలెం
రైల్వే
స్టేషన్ల
మధ్య
ఈ
గూడ్స్
రైలు
ప్రమాదానికి
గురైంది.
ఈ ప్రమాదంలో గూడ్స్ రైలుకు చెందిన ఆరు బోగీలు తునకలు తునకలై పక్క ట్రాక్ మీద పడ్డాయి. దీంతో ఈ మార్గంలో పలు రైళ్ల రాకపోకలు ఆగిపోయాయి. కొండపల్లి నుంచి విశాఖపట్నం స్టీల్ప్లాంటుకు ఈ గూడ్స్ రైలు సున్నంరాయి లోడుతో వెళ్తోంది. గూడ్స్ రైలు చివరి ఆరు బోగీలు పట్టాలు తప్పాయి. ప్రమాదానికి లోనైన బోగీలు విద్యుత్ స్తంభాన్ని బలంగా ఢీకొన్నాయి. రైలుకు విద్యుత్ సరఫరా చేసే వైర్లు బోగీలపై పడ్డాయి. దీంతో పెద్దయెత్తున మంటలు లేచాయి.
బుధవారం ఉదయం ఎనిమిదిన్నర గంటలకు ఈ ప్రమాదం జరిగింది. అంతకు రెండు గంటల ముందే విశాఖ, గోదావరి ఎక్స్ప్రెస్లు ఈ ట్రాక్ మీదుగా వెళ్లాయి. ఈ గూడ్స్ వెనక వస్తున్న తిరుమల ఎక్స్ప్రెస్ను గుల్లిపాడు స్టేషన్లో ఆపేశారు. గార్డు దూకేసి ప్రాణాలు దక్కించుకున్నాడు.