రాజీనామా చేసిన ప్రమోద్, ఉమ
న్యూఢిల్లీ:
పార్టీ
బాధ్యతలను
చేపట్టడానికి
కమ్యూనికేషన్ల
మంత్రి
ప్రమోద్
మహాజన్
బుధవారం
రాజీనామా
చేశారు.
ఇది
డిమోషన్
కాదని
ఆయన
అన్నారు.
మంత్రి పదవికి రాజీనామా చేయడానికి టెలికమ్ వ్యవహారం గానీ, శివాని భట్నాగర్ హత్య కేసులో తన పేరు వినిపించడం గానీ కారణాలు కావని ఆయన మంత్రిపదవికి రాజీనామా చేసిన అనంతరం విలేకరులతో అన్నారు.
మహాజన్ భారతీయ జనతా పార్టీ (బిజెపి) ప్రధాన కార్యదర్శిగా పదవీ బాధ్యతలు నిర్వహిస్తారు. పార్టీ పనిని తనకు అప్పగించడం అంటే తాను పార్టీకి తిరిగి రావడం కాదని ఆయన అన్నారు. అవసరం వచ్చినప్పుడు ఎవరో ఒకరు ప్రభుత్వం నుంచి పార్టీకి వెళ్లాల్సి వుంటుందని ఆయన అన్నారు. రాజకీయం అతి క్రూరమైన క్రీడ. శివానీ భట్నాగర్ హత్యతో నాకు సంబంధం ఉండి ఉంటే ప్రభుత్వం నుంచి నన్ను ఎప్పుడో బయటకు పంపేవారు అని ఆయన అన్నారు.
పలు రాష్ట్రాల శాసనసభా ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో తనపై విశ్వాసంతో పార్టీ నాయకత్వం తనకు పార్టీ బాధ్యతలు అప్పగిస్తున్నాదని ఆయన చెప్పుకున్నారు. వచ్చే 12 నెలలు చాలా కీలకమైనవని, ఈ సవాల్ను తాను ఎదుర్కుంటానని ఆయన అన్నారు.
బొగ్గు,
గనుల
శాఖ
మంత్రి
ఉమా
భారతి
కూడా
తన
మంత్రి
పదవికి
బుధవారం
రాజీనామా
సమర్పించారు.
ఆమె
తన
రాజీనామా
లేఖను
ప్రధాని
అటల్
బిహారీ
వాజ్పేయికి
అందజేశారు.
బిజెపి
ఎన్నికల
ప్రచారానికి
సారథ్యం
వహించేందుకు
తనను
మధ్యప్రదేశ్కు
పంపవచ్చుననే
వార్తల
నేపథ్యంలో
ఆమె
మంత్రి
పదవికి
రాజీనామా
చేశారు.
తన
రాజీనామాకు
ముందు
ఆమె
ఉప
ప్రధాని
ఎల్.కె.
అద్వానీని
కలుసుకున్నారు.