వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
సినీనటి పండరీబాయి కన్నుమూత
చెన్నై:
ప్రముఖ
సినీనటి
పండరీబాయి
బుధవారం
ఉదయం
కన్ను
మూశారు.
మూత్రపిండాల
వ్యాధితో
అపోలో
ఆస్పత్రిలో
చికిత్స
పొందుతున్న
ఆమెకు
బుధవారం
గుండెపోటు
వచ్చింది.
దీంతో
ఆమె
మృతి
చెందారు.
ఆమెకు
73
ఏళ్లు.
ఆమెకు
భర్త,
ఇద్దరు
కుమారులు
ఉన్నారు.
డిసెంబర్ 19వ తేదీన ఆమెను ఆస్పత్రిలో చేర్చారు. ఆమె చికిత్స నిమిత్తం తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత అన్నా ట్రస్టు ద్వారా నిధులు ఇప్పించారు. పండరీబాయి మృతికి జయలలిత సంతాపం ప్రకటించారు.
పాతతరం నటి పండరీబాయి తెలుగు, కన్నడ, తమిళం, హిందీ, కొంకణి, తుళు, తదితర భాషల్లో 400కు పైగా సినిమాల్లో నటించారు. కర్ణాటకలోని భత్కళ గ్రామానికి చెందిన ఆమె 1943లో చలన చిత్రరంగంలో ప్రవేశించారు. ఆమె మొదటి చిత్రం వాణి. 1956లో సంచలనం సృష్టించిన పరాశక్తి సినిమాలో శివాజీ గణేషన్ సరసన హీరోయిన్గా నటించారు.
Comments
Story first published: Wednesday, January 29, 2003, 23:53 [IST]