వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
నక్సల్స్ చెరలో ఎస్సై
కర్నూలు: కర్నూలు జిల్లా ఆత్మకూరు మండలంలో వార్ మరోసారి పోలీసు అధికారుల కిడ్నాప్ కు పాల్పడ్డారు. బుధవారం అర్ధరాత్రి ఇద్దరు పోలీసు అధికారులను, మండలాధ్యక్షున్ని కిడ్నాప్ చేశారు. అయితే, సీఐ, మండలాధ్యక్షుణ్ణి వార్ నాయకులు వదిలేశారు.
రాత్రి 12 గంటల ప్రాంతంలో వార్ దళం సభ్యులు మండలపరిషత్ అధ్యక్షుడు మోహన్ రెడ్డి, ఏఎస్సై మధుసూధన్, ఎస్సై మధుసూధన్ రావు, సీఐ సురేంద్రబాబులను కిడ్నాపు చేశారు. అడవుల్లోకి తీసుకువెళుతుండగా, ఏఎస్సై తప్పించుకోగా, సీఐ తాను క్లర్క్ నని చెప్పడంతో మండలాధ్యక్షుడితో పాటు అతన్ని వార్ నక్సల్స్ విడుదల చేశారు. కడప జిల్లా పెద్ద ముగియం ఎస్సైగా పనిచేస్తోన్న మధుసూధన్ రావు మాత్రం ప్రస్తుతం వార్ చెరలో ఉన్నారు.
Comments
Story first published: Thursday, January 30, 2003, 23:53 [IST]