వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

భారీగా ఆర్టీసి ఛార్జీల వడ్డన

By Staff
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌: ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (ఎపిఎస్‌ఆర్‌టిసి) బస్సు ఛార్జీలు పెరిగాయి. కిలో మీటరుకు మూడు పైసలు పెంచుతూ ఆర్టీసి యాజమాన్యం చేసిన ప్రతిపాదనలకు ప్రభుత్వం ఆమోదం ముద్ర వేసింది.

ఆర్టీసి యాజమాన్య ప్రతినిధులతో ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు గురువారం సమావేశమయ్యారు. ఛార్జీల వడ్డనకు ఆర్టీసి యాజమాన్యం సమర్పించిన ప్రతిపాదనలపై ఆయన మాట్లాడారు. ఆర్టీసి అంతర్గత సామర్థ్యం పెంచుకునేందుకు చర్యలు చేపట్టాలని ఆయన సూచించారు. అంతర్గత సామర్థ్యం పెంచుకోవడంతో పాటు ఛార్జీలు పెంచితే తప్ప నష్టాల నుంచి గట్టెక్కలేమని ఆర్టీసి చైర్మన్‌ శోభానాగిరెడ్డి విలేకరులతో అన్నారు. కిలోమీటరుకు మూడు పైసల చొప్పున ఛార్జీలు పెంచేందుకు ఆర్టీసి ప్రభుత్వానికి ప్రతిపాదనలు సమర్పించింది.

ఆర్టీసి ప్రస్తుతం 150 కోట్ల రూపాయల నష్టాల్లో ఉన్నదని, ఛార్జీలు పెంచితే 144 కోట్ల రూపాయల నష్టం భర్తీ అవుతుందని ఆమె చెప్పారు. ఉద్యోగుల డిఎ రూపంలో ఆర్టీసిపై మరో 50 కోట్ల రూపాయల భారం పడుతుందని, ఈ భారాన్ని ప్రజలపై మోపబోమని రవాణా శాఖ మంత్రి ముద్దసాని దామోదర్‌ రెడ్డి చెప్పారు. ఆర్టీసి బస్సుల ఆక్యుపెన్సీ పెంచడంతో అంతర్గత సామర్థ్యం పెంచుకుంటామని, ఛార్జీలపై పెంపుపై రెండు మూడు రోజుల్లో నిర్ణయం తీసుకుంటామని ఆయన చెప్పారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X