వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
సింగరేణి చర్చల్లో వీడని ప్రతిష్టంభన
హైదరాబాద్:
సింగరేణి
సమ్మె
పరిష్కారానికి
జరుగుతున్న
చర్చల్లో
ప్రతిష్టంభన
వీడలేదు.
కొత్తగూడెంలో
జరుగుతున్న
చర్చలకు
గురువారం
సింగరేణి
పరిరక్షణ
సమితి
ముఖ్యనాయకులు
ఎవరూ
హాజరు
కాలేదు.
మొత్తం 15 డిమాండ్లతో సింగరేణి కార్మికులు చేస్తున్న సమ్మె గురువారంనాడు తొమ్మిదో రోజుకు చేరుకుంది. కొయ్యగూడెం ఓపెన్ కాస్ట్ మైన్ కాంట్రాక్టుపై కార్మిక సంఘాల నేతలు పట్టువీడకపోవడంతో చర్చలు ముందుకు సాగడం లేదు. కార్మికుల సమ్మెకు మద్దతుగా రాజకీయ పార్టీలు రంగంలోకి దిగాయి. రాస్తారోకోలు, ధర్నాలు జరిగాయి.
ఇదిలా వుంటే, ఒక వర్గం కార్మికులు పనుల్లోకి దిగారని సింగరేణి యాజమాన్యం అంటోంది. బుధవారంనాడు రామగుండం ప్రాంతంలో రికార్డు స్థాయిలో 87 వేల టన్నుల బొగ్గు ఉత్పత్తి అయిందని ప్రకటించింది. గురువారంనాడు 590 మంది కోల్ ఫిల్లర్లు పనులకు వచ్చారని యాజమాన్యం అంటోంది.
Comments
Story first published: Thursday, January 30, 2003, 23:53 [IST]