ఎన్డిఎ ప్రభుత్వంపై సోనియా ధ్వజం
న్యూఢిల్లీ:
భారతీయ
జనతా
పార్టీ
నేతృత్వంలోని
జాతీయ
ప్రజాస్వామ్య
కూటమి
(ఎన్డిఎ)
ప్రభుత్వంపై
కాంగ్రెస్
అధ్యక్షురాలు
సోనియా
గాంధీ
తీవ్రంగా
ధ్వజమెత్తారు.
గత
నాలుగేళ్ల
ఎన్డిఎ
పాలనలో
పేదరికం,
నిరుద్యోగం,
అవినీతి
పెరిగాయని,
పేదలకు,
సంపన్నులకు
మధ్య
అగాధం
మరింత
పెరిగిందని
ఆమె
విమర్శించారు.
మహత్మాగాంధీకి
నివాళులర్పించడానికి
ఏర్పాటయిన
సభలో
గురువారం
ప్రసంగించారు.
ప్రభుత్వం అమలు చేస్తున్న పెట్టుబడుల ఉపసంహరణ, ప్రైవేటీకరణ విధానాలు ప్రజలకు, పేదలకు వ్యతిరేకమైనవని ఆమె అన్నారు. లాభాల్లో నడుస్తున్న ప్రభుత్వ రంగ సంస్థలను ప్రభుత్వం కారు చౌకకు అమ్ముతోందని, ఫలితంగా కొందరు మాత్రమే ధనవంతులవుతున్నారని, పేదలు బాధలు పడుతున్నారని ఆమె అన్నారు.
జాతిపతిను హత్య చేసినవారు, గుజరాత్ హింస వెనుకు ఉన్నవారు ఒకే సిద్దాంతానికి చెందినవారని ఆమె పార్టీ పేరు గానీ, సంస్థ పేరు గానీ ప్రస్తావించకుండా బిజెపిని, సంఘ్పరివార్ను విమర్శించారు.
మతశక్తులు దేశ లౌకిక, ప్రజాతంత్ర విధానాలకు ప్రమాదంగా పరిణమించాయని, గాంధీజీ ఆచరించిన అహింస, సత్యాలను ధ్వంసం చేసే పనికి పూనుకున్నారని ఆమె అన్నారు. మతతత్వానికి వ్యతిరేకంగా పోరాడేందుకు సిద్ధం కావాలని ఆమె పార్టీ నేతలకు పిలుపునిచ్చారు.