చేతులు కలిపిన లెఫ్ట్, కాంగ్రెస్
హైదరాబాద్:
సింగరేణి
కార్మికుల
సమ్మెకు
వామపక్షాలు
మద్దతు
ప్రకటించాయి.
సింగరేణి
కార్మికుల
సమ్మెకు
మద్దతుగా
ఫిబ్రవరి
3వ
తేదీన
సచివాలయం
వద్ద
ధర్నా
చేయాలని
సిపిఎం
నిర్ణయం
తీసుకుంది.
సిపిఐతో కలిసి ఈ ధర్నా చేయనున్నట్లు సిపిఎం రాష్ట్ర కార్యదర్శి బి.వి. రాఘవులు చెప్పారు. శాంతియుతంగా ధర్నా చేస్తున్న సింగరేణి కార్మిక నాయకులను పోలీసులుఅరెస్టు చేశారని ఆయన విమర్శించారు. సింగరేణి ప్రైవేటీకరణకుస్వస్తి చెప్పాలని, కార్మికుల డిమాండ్లను అంగీకరించాలని ఆయన డిమాండ్ చేశారు.
వామపక్షాలు తలపెట్టిన ధర్నాలో కాంగ్రెస్ కూడా పాల్గొంటుంది. ఈ ధర్నాలోస్వయంగా తాను పాల్గొంటానని ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ(పిసిసి) అధ్యక్షుడు ఎం. సత్యనారాయణ రావు చెప్పారు. ఇప్పటికే తమ పార్టీ సింగరేణి కార్మికులకు మద్దతుగా ఆందోళనకు దిగారని ఆయన చెప్పారు.
ఆర్టీసి ఛార్జీల పెంపునకు నిరసనగా ఆందోళనలకుశ్రీకారం చుట్టాలని సిపిఎం నిర్ణయించింది. కాంగ్రెస్ ఇప్పటికే ఆందోళన కార్యక్రమాలు ప్రారంభించింది.