సింగరేణి సమ్మె ఉధృతం- ఉద్రిక్తత
హైదరాబాద్: గత పది రోజులుగా జరుగుతున్న సమ్మె శుక్రవారం ఉధృతమైంది. కార్మిక సంఘాల నాయకులు కరీంనగర్ జిల్లా గోదావరిఖనిలో తలపెట్టిన బహిరంగసభను, ధర్నాను పోలీసులు శుక్రవారం భగ్నం చేశారు. ఈ సందర్భంగా ఉద్రిక్తత చోటు చేసుకుంది.
కార్మికుల సమ్మెకు మద్దతుగా వెళ్లిన రాజకీయ నాయకులను కూడా పోలీసులుఅరెస్టు చేశారు. శాసనసభ్యుడు శ్రీధర్, తదితరులను పోలీసులుఅరెస్టు చేశారు. దాదాపు రెండు వందల మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. గోదావరిఖని, రామగుండంలలో కార్మికులు బంద్ పాటించారు. ర్యాలీలు నిర్వహించారు. పోలీసుస్టేషన్ ఎదుట బైఠాయించారు.
అరెస్టులతో తమకు సంబంధం లేదని సింగరేణి యాజమాన్యనం ప్రకటించింది. శాంతిభద్రతల సమస్య ఎదురైనప్పుడు పోలీసులు జోక్యం చేసుకుంటారని యాజమాన్యం ప్రతినిధి చెప్పారు. ఇదిలా వుంటే, సింగరేణి కార్మికుల సమ్మెకు మద్దతుగా రాష్ట్ర బంద్ నిర్వహించాలని సిపిఎం నిర్ణయించింది.