వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఇరాక్‌పై యుద్ధం వద్దు: అద్వానీ

By Staff
|
Google Oneindia TeluguNews

బ్యాంగ్‌కాక్‌: ఇరాక్‌పై యుద్ధం కూడదని భారత ఉప ప్రధాని ఎల్‌.కె. అద్వానీ అన్నారు. ఈవిషయంలో ఏ దేశం కూడా ఏకపక్ష నిర్ణయం తీసుకోకూడదని, ఈవిషయంలో ఐక్యరాజ్య సమితి మాత్రమే నిర్ణయం తీసుకోవాలని ఆయన అన్నారు.

థాయ్‌లాండ్‌లోని ఫుకేత్‌కు బయలుదేరే ముందు ఆయనవిలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఐక్యరాజ్య సమితి నిర్ణయాన్ని బగ్దాద్‌ కూడాఅంగీకరించాలని, సామూహిక విధ్వంసానికి కారణమయ్యే ఆయుధాలకుస్వస్తి చెప్పాలని ఆయన అన్నారు. యుద్ధం వస్తే గల్ఫ్‌లోని తమ దేశస్థుల పరిస్థితి ఏమిటనేది తమకు ఆందోళనగా ఉన్నదని ఆయన ఒక ప్రశ్నకు సమాధానంగా అన్నారు. ఈ ప్రాంతంలోని భారత ప్రజల క్షేమం గురించి తాము ఆలోచిస్తున్నామని, పరిస్థితి జాగ్రత్తగా పరిశీలిస్తున్నామని ఆయన చెప్పారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X