డీజిల్ ధర పెంపు వల్లనే : బాబు
హైదరాబాద్: డీజిల్ధర పెరగడం వల్లనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(ఎపియస్ఆర్టిసి) బస్సు ఛార్జీలు పెంచాల్సి వచ్చిందని ముఖ్యమంత్రి,తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడుఅన్నారు. తెలుగుదేశం విస్తృతస్థాయిసమావేశంలో ఆయన శనివారం ప్రసంగించారు.
గల్ఫ్ యుద్ధం వస్తే మరింతగా ఛార్జీలుపెరుగుతాయని ఆయన చెప్పారు. ఉద్యోగుల డిఎ, నిర్వహణా భారంవంటి వాటికన్నా డీజిల్ ధరల వల్ల పడిన భారాన్ని పూడ్చడానికే ఆర్టీసిబస్సు ఛార్జీలు పెంచాల్సి వచ్చిందని ఆయన వివరించారు.అనివార్య స్థితిలోనే ఆర్టీసి బస్సు ఛార్జీలు పెంచామనిఆయన చెప్పారు. మంచినీటి కొరత, ఆర్టీసి ఛార్జీలపెంపు, సింగరేణి సమ్మె వంటి అంశాలను తడుముతూఆయన ప్రసంగం సాగింది.
పార్టీలోని గ్రూప్ విభేదాల పట్లఆయన ఆందోళన వ్యక్తం చేశారు. పార్టీలో విభేదాల తననుకలవరపెడుతున్నాయని ఆయన అన్నారు. విభేదాల పరిష్కారానికి పరస్పరఅవగాహన పెంపొందించుకోవాలని ఆయన పార్టీనాయకులకు సూచించారు. అవినీతి ఎక్కడున్నా ఎత్తిచూపాలని ఆయన పిలుపునిచ్చారు. రాష్ట్రంలో పదివేల బోరుబావులుఎండిపోయాయని, ప్రజలకు మంచినీరందించడానికి ఉన్నవనరులను అన్నింటినీ ఉపయోగిస్తామని ఆయనచెప్పారు. ఈ నెల 4వ తేదీ నుంచి జరిగే సంస్థాగతఎన్నికల్లో లక్ష కమిటీలు వేస్తామని ఆయనచెప్పారు.