వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
నక్సల్స్ సానుభూతిపరుల విడుదల
కర్నూలు: నక్సలైట్ల డిమాండ్ల మేరకు 18 మంది పీడబ్ల్యూజీ సానుభూతిపరులను శనివారం ఉదయంవిడుదల చేశారు. కిడ్నాప్ కుగురైన కర్నూలుకు చెందిన ఎస్సై మధుసూధన్ విడుదల కోసం ప్రభుత్వం నక్సలైట్ల డిమాండ్ లకు తలొగ్గినవిషయం విదితమే.
జైల్లో ఉన్న 18 మంది సానుభూతిపరులను విడుదల చేసినట్లు కర్నూలు పోలీసులు ప్రకటించారు. ఇక మధుసూదన్ విడుదల కోసం పోలీసుల వేచి చేస్తున్నారు. నల్లమల్ల అడవుల్లో సుదూర ప్రాంతాలకు అతన్ని తీసుకువెళ్ళి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు.
Comments
Story first published: Saturday, February 1, 2003, 23:53 [IST]