వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
ఆర్టీసి ఛార్జీల పెంపుపై నిరసన
హైదరాబాద్:
ఆంధ్రప్రదేశ్
రాష్ట్ర
రోడ్డు
రవాణా
సంస్థ(ఎపియస్
ఆర్టిసి)
బస్సు
ఛార్జీల
పెంపునకుసర్వత్రా
నిరసన
వ్యక్తమవుతోంది.
రాష్ట్రంలోని
పలు
ప్రాంతాల్లో
నిరసన
ప్రదర్శనలు,
ధర్నాలు
జరిగాయి.
వరంగల్లో సిపిఐ, దాని అనుబంధ సంస్థలు ర్యాలీ నిర్వహించాయి. అనంతరం కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించాయి. గుంటూరు జిల్లా నర్సారావుపేట ఆర్డీవో కార్యాలయం ముందు సిపిఐ కార్యకర్తలు ధర్నాలు చేశారు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాతనే ఆర్టీసి ఛార్జీలుపెరిగాయని కాంగ్రెస్ అధికార ప్రతినిధి కె. రోశయ్య గుంటూరులో అన్నారు. హైదరాబాద్, సికింద్రాబాద్ జంటనగరాల సిపిఐ కమిటీ సచివాలయం వద్ద పికెటింగ్ నిర్వహించింది. అనంతరం రాస్తారోకో చేసింది. ఆర్టీసి ఛార్జీలను తగ్గించకపోతే అన్ని వామపక్షాలతో కలిసి ఆందోళనను ఉధృతం చేస్తామని సిపిఐ హెచ్చరించింది.
Comments
Story first published: Saturday, February 1, 2003, 23:53 [IST]