ఓర్వలేకే సింగరేణి సమ్మె: సిఎం
హైదరాబాద్: తమ విజయాలనుచూసి ఓర్వలేని వారే సింగరేణి సమ్మెకు ఆజ్యం పోస్తున్నారని ముఖ్యమంత్రినారా చంద్రబాబునాయుడు విమర్శించారు. సింగరేణిసమ్మెపై ఆయన శనివారం మాట్లాడారు.
సింగరేణి ప్రైవేటీకరణ ఉండదని, ఉద్యోగులను కూడాతొలగించబోమని ఆయన స్పష్టం చేశారు.రాజకీయ ప్రయోజనాల కోసం సింగరేణిలో సమ్మెను నడుపుతున్నారనిఆయన అన్నారు. మూడున్నర దశాబ్దాల తర్వాత సింగరేణి లాభాల్లోకివచ్చిందని, గరిష్ట స్థాయిలో బొగ్గు ఉత్పత్తిజరుగుతోందని, ఈ స్థితిలో సింగరేణి కార్మికులు సమ్మెకుదిగారని ఆయన అన్నారు. శాసనసభ్యులు సింగరేణి బొగ్గుగనులకువెళ్లి అరెస్టు కావడం సమంజసం కాదని ఆయన అభిప్రాయపడ్డారు.
ఇదిలా వుంటే, సింగరేణి సమ్మెకుమద్దతుగా సోమవారం కాంగ్రెస్ సచివాలయంవద్ద ధర్నా నిర్వహించనుంది. ప్రదేశ్కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు ఎం. సత్యనారాయణరావువిజయవాడలో ఈ విషయం చెప్పారు. ఈ ధర్నాలో సిపిఐ కూడాపాల్గొంటుంది. కార్మికుల డిమాండ్పై స్పష్టమైహామీలు ఇవ్వాలని సిపిఐ కార్యదర్శి సురవరం సుధాకర్ రెడ్డిప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సింగరేణి సమ్మెకుమద్దతుగా తెలంగాణ రాష్ట్ర సమితి పలు చోట్లధర్నాలు నిర్వహించింది.