స్టార్స్ మ్యాచ్: కప్ చిరు జట్టు సొంతం
హైదరాబాద్: మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ అధ్వర్యంలో ఆదివారం హైదరాబాద్ లోని లాల్ బహుదూర్ స్టేడియంలోనిర్వహించిన టాలీవుడ్ తారల స్టార్ క్రికెట్ మ్యాచ్ లో చిరంజీవి జట్టు కప్ ను గెలుచుకొంది. చిరంజీవి, వెంకటేష్ జట్టుల మధ్య జరిగిన ఫైనల్స్ లో చిరంజీవి జట్టు 13.3 ఓవర్లోనే విజయం సొంతం చేసుకొంది.
అంతకుముందు జరిగిన మ్యచ్ లలోమార్నింగ్ సెషన్ లో చిరు, బాలయ్య జట్టులు తలపడ్డాయి. తొలుత బ్యాటింగ్ చేసిన చిరంజీవి జట్టు 20ఓవర్లలో 153 పరుగుల భారీ స్కోర్ సాధించింది.కెప్టెన్ చిరంజీవిడకౌట్ కాగా, హీరో శ్రీకాంత్, రాజీవ్ కనకాల టాప్ స్కోరర్ లు గానిలిచారు. రాజీవ్ హాఫ్ సెంచరీ కూడా చేయడంవిశేషం.
అనంతరం బ్యాటింగ్ చేసిన బాలకృష్ణ జట్టు కూడాబాగానే ఆడినా..చివర్లో త్వరగా వికెట్లుకోల్పయింది. 132 పరుగులకు ఆలౌట్ కావడంతో చిరంజీవి జట్టుఫైనల్స్ కు చేరుకొంది. మధ్యాహ్నం సెషన్లో వెంకటేష్, నాగార్జున టీమ్తలపడతోంది.
మధ్యాహ్నం సెషన్ లో నాగార్జున, వెంకటేష్ జట్టు పాల్గొనగా, నాగార్జున జట్టు తొలుత బ్యాటింగ్చేసింది. కెప్టెన్ నాగార్జున 24 పరుగులతో టాప్ స్కోరర్ గా నిలిచాడు. ఉదయ్ కిరణ్, ఎన్టీఆర్ జూనియర్ ఆయనకు మంచి సపోర్ట్ ఇచ్చినా..ఆ జట్టు కేవలం 102 పరుగులు చేయగలిగింది.
అనంతరం బ్యాటింగ్ చేపట్టిన వెంకటేష్ జట్టు తొలి నుంచి ప్రదర్శనను కనబరిచింది. వెంకటేష్ కేవలం ఒక పరుగు చేసి నాగార్జున బౌలింగ్ లో అవుట్కాగా..హీరో సచిన్, విలన్ జీవీ భారీగా రన్ లు తీస్తూ జట్టునువిజయపథాన చేర్చారు. 13.4 ఓవర్లలోనే వెంకటేష్ జట్టు మూడువికెట్లు కోల్పోయి 104 పరుగులు సాధించి విజయాన్నిసాధించింది.