నెల్లూరుకు శ్రీరాములు పేరు పరిశీలన
హైదరాబాద్: నెల్లూరు జిల్లాకు పొట్టి శ్రీరాములు పేరు పెట్టాలన్న ప్రతిపాదనను పరిశీలించాలని తెలుగుదేశం పార్టీ పాలిట్ బ్యూరో అభిప్రాయపడింది. టీడీపీ పాలిట్ బ్యూరో ఆదివారం పార్టీ కార్యాలయంలో అధ్యక్షుడు, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమక్షంలో రెండు గంటల పాటు సమావేశం అయింది. ఆర్టీసీ చార్జీల పెంపు, జాతీయ రహదారులపై ఆటోల నిషేధం.....వంటి అంశాలపై చర్చించనట్లు పార్టీ ప్రతినిధి ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు విలేకరులకు తెలిపారు.
ఆర్టీసీ ఛార్జీల పెంపును సమర్ధించినప్పటికీ సంస్థ నష్టాలను ప్రయాణీకులపై భారం మోపకూడదని సూచించినట్లు తెలిపారు. పలు వర్గాల నుంచి నెల్లూరు జిల్లా పేరు మార్పునకు ఒత్తిడి వస్తున్నందున..ఆ అంశాన్ని ప్రభుత్వం పరిశీలించాలని టీడీపీ పాలిట్ బ్యూరో అభిప్రాయపడింది. జాతీయ రహదారులపై ఆటోల ప్రవేశాన్ని నిషేధిస్తూ ప్రభుత్వం తీసుకొన్న నిర్ణయాన్ని కూడా పునరాలోచించాలని బ్యూరో సూచించింది.