వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
విడుదలైన ఎస్సై మధుసూదన్
కర్నూలు: నిషిద్ధ పీపుల్స్వార్ నక్సలైట్లు కిడ్నాప్ చేసిన ఆత్మకూరు సబ్ఇన్స్పెక్టర్ మధుసూదన్ సోమవారం ఆత్మకూరుకుచేరుకున్నారు. ఆయన రాక కోసం పోలీసు ఉన్నతాధికారులు ఆత్మకూరు పోలీసుస్టేషన్లో ఎదురు చూస్తున్నారు.
మధుసూదన్ను పీపుల్స్వార్ నక్సలైట్లు నల్లమల అడవుల్లో వదిలేశారని పౌర హక్కుల నాయకులు ఆదివారం ప్రకటించారు. అయితే ఆయనను సోమవారంసాయంత్రం నల్లమల అటవీ ప్రాంతంలో విడుదలచేయగా...మూడు కిలోమీటర్ల దూరం నడిచివచ్చి ఆత్మకూరుకు చేరుకున్నారు. దీంతో పోలీసులు ఊపిరిపీల్చుకున్నారు. ఆయన కుటుంబసభ్యుల్లోఆనందం వ్యక్తమవుతోంది. ఆయన తల్లితోఆనందంగా విలేకరులతో మాట్లాడారు. పోలీసులుఆయన్ని మంగళవారం ఉదయంజమ్మలమడుగు తిరిగి పంపించే ఏర్పాట్లుచేస్తున్నారు.
Story first published: Monday, February 3, 2003, 23:53 [IST]