వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ముడి చమురు నిల్వల పెంపు

By Staff
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం ముడిచమురు నిల్వలను పెంచుకునే ప్రయత్నాలు ప్రారంభించింది.ఇరాక్‌పై అమెరికా యుద్ధానికి దిగితే ముడి చమురు సరఫరాకుఅంతరాయం కలిగే సూచనలు ఉన్నందున ఈప్రయత్నాలను మొదలు పెట్టింది. ముడి చమురు సరఫరాకు ఏర్పడేఅడ్డంకులను తట్టుకోవడానికి తీసుకుంటున్నచర్యలపై ప్రధాని అటల్‌ బిహారీ వాజ్‌పేయి సోమవారం సమీక్షజరిపారు.

అవాంతరాలను అధిగమించడానికిప్రత్యామ్నాయ ప్రణాళికను అమలుచేస్తున్నామని, ఆయిల్‌ కంపెనీలు ట్యాంకులనునింపుకున్నాయని, తగినంత నిల్వలున్నాయని, ఈనిల్వలు రెండు నెలలకు సరిపోతాయని సమీక్షా సమావేశానంతరంపెట్రోలియం శాఖ మంత్రి రామ్‌ నాయక్‌ విలేకరులతోచెప్పారు.

ఆయిల్‌ కంపెనీలు 45 రోజుల పెట్రోలియం ఉత్పత్తులను, 15 రోజుల ముడిచమురును నిల్వ చేసి పెట్టుకున్నాయని ఆయనచెప్పారు. కువైట్‌ నుంచి ప్రధానంగా భారత్‌కు ముడిచమురు సరఫరా అవుతుంది. ఇరాక్‌పై అమెరికాయుద్ధం ప్రకటిస్తే ఈ సరఫరాపై ప్రభావంపడవచ్చు. ఇరాక్‌ నుంచి 1.4 మిలియన్‌ టన్నుల ముడిచమురును మాత్రమే దిగుమతిచేసుకుంటున్నామని, యుద్ధం వస్తే ఇది మాత్రమేఆగిపోతుందని మంత్రి అన్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X