వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

గల్ఫ్‌ వడ్డన ఉండదు: ఆర్టీసి

By Staff
|
Google Oneindia TeluguNews

తిరుపతి: గల్ఫ్‌ యుద్ధం వచ్చినా బస్సు ఛార్జీలు పెంచబోమని ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (ఎపియస్‌ఆర్‌టిసి) మేనేజింగ్‌ డైరెక్టర్‌ ఆర్‌.పి. సింగ్‌ చెప్పారు. ఆర్టీసి బస్సు స్టేషన్‌ను ఆయన సోమవారం తనిఖీ చేశారు.

పెంచిన ఆర్టీసి బస్సు ఛార్జీలు స్వల్పమేనని ఆయన అభిప్రాయపడ్డారు. గత మూడేళ్లలో డీజిల్‌ ధర పది సార్లు పెరిగిందని, దీని భారం ఆర్టీసిపై ఇతోధికంగా పడిందని, ఈ పరిస్థితిలో ఛార్జీలు పెంచకతప్పలేదని ఆయన వివరణ ఇచ్చారు. మొత్తం 5,800 మంది ఆర్టీసి ఉద్యోగుల స్వచ్ఛంద పదవీ విరమణ కోసం 200 కోట్ల రూపాయలు ఖర్చవుతాయని ఆయన చెప్పారు.

ఇదిలా వుంటే, పెంచిన ఆర్టీసి బస్సు ఛార్జీలు మంగళవారం నుంచి అమలులోకి వస్తాయి. కిలోమీటరుకు మూడు పైసలు పెంచుతూ ఆర్టీసి సమర్పించిన ప్రతిపాదనలను రాష్ట్ర ప్రభుత్వం ఇటీవలే ఆమోదించింది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X