విపక్షాల సత్యాగ్రహం భగ్నం
హైదరాబాద్:
సింగరేణి
కార్మికుల
సమ్మెకు
మద్దతుగా
ప్రతిపక్షాలు
సచివాలయం
వద్ద
తలపెట్టిన
సత్యాగ్రహాన్ని
పోలీసులు
సోమవారం
భగ్నం
చేశారు.
కాంగ్రెస్,
తొమ్మిది
వామపక్షాలు,
తెలంగాణ
రాష్ట్ర
సమితి,
మజ్లీస్
ఈ
సత్యాగ్రహాన్ని
తలపెట్టాయి.
సత్యాగ్రహానికి సచివాలయానికి కదలివస్తున్న ప్రతిపక్షాల నాయకులను, కార్యకర్తలను పోలీసులు అరెస్టు చేశారు. ఓల్డ్ ఎమ్మెల్యే క్వార్టర్ నుంచి సచివాలయం వైపు వస్తున్న ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (పిసిసి) అధ్యక్షుడు ఎం. సత్యనారాయణరావు, కాంగ్రెస్ లెజిస్లేచర్ పార్టీ (సిఎల్పి) నేత డాక్టర్ వై.యస్. రాజశేఖర్ రెడ్డిలతో పాటు కాంగ్రెస్ కార్యకర్తలను పోలీసులు లిబర్టీ వద్ద అరెస్టు చేసి అంబర్పేట పోలీసు స్టేషన్కు తరలించారు. అరెస్టులతో సింగరేణి సమ్మెను అణచివేయడానికి ప్రభుత్వం ప్రయత్నిస్తోందని, సింగరేణి కార్మికుల సమ్మెకు మద్దతు ఇస్తున్న శాసనసభ్యులను, వివిధ రాజకీయ పార్టీల నేతలను పోలీసులు అరెస్టు చేస్తున్నారని, ప్రభుత్వ దమనకాండను కొనసాగిస్తోందని సిఎల్పి నేత డాక్టర్ వై.యస్. రాజశేఖర్ రెడ్డి విమర్శించారు.
సిపిఎం రాష్ట్ర కార్యదర్శి బి.వి. రాఘవులను, మజ్లీస్ శాసనసభ్యుడు అసదుద్దీన్ ఓవైసీని కూడా లిబర్టీ వద్ద అరెస్టు చేశారు. సిపిఐ కార్యాలయం మఖ్దూం భవన్ వద్ద ఆ పార్టీ కార్యకర్తలను అదుపులోకి తీసుకున్నారు. తమ భవిష్యత్తు ఆందోళనకార్యక్రమాన్ని మంగళవారం సాయంత్రం నిర్ణయించుకుంటామని ప్రతిపక్షాలు ప్రకటించాయి.
ఇదిలా వుంటే, సింగరేణి కార్మికు సంఘాల నాయకులకు, సింగరేణి యాజమాన్య ప్రతినిధులకు మధ్య సోమవారం మళ్లీ చర్చలు ప్రారంభమయ్యాయి. అయితే చర్చలు ముందుకు సాగడం లేదు.