చర్చలు లేదా కోర్టు ఆర్డరు: అద్వానీ
సింగపూర్:
అయోధ్య
వివాదం
చర్చల
ద్వారా
గానీ,
కోర్టు
తీర్పు
ద్వారా
గానీ
పరిష్కారం
కావాలని
ఉప
ప్రధాని
ఎల్.కె.
అద్వానీ
అన్నారు.
మూడు
రోజుల
పర్యటన
నిమిత్తం
ఇక్కడికి
వచ్చిన
ఆయన
మంగళవారం
భద్రత,
అభివృద్ధిపై
ప్రసంగించారు.
ఈ
సందర్భంగా
వచ్చిన
ప్రశ్నకు
సమాధానమిస్తూ
ఆయన
ఆ
విధంగా
అన్నారు.
గోద్రా ఊచకోతకు తీవ్ర ప్రతిస్పందనే గుజరాత్లోని మత హింస అని ఆయన అన్నారు. బలాన్ని ఉపయోగించి రాష్ట్ర ప్రభుత్వం ఈ హింసకు అడ్డుకట్ట వేసిందని, పోలీసు కాల్పుల్లో 200 మంది మరణించారని ఆయన చెప్పారు. ప్రతిపక్షాలు చేసినవిషప్రచారానికి వ్యతిరేకంగానే ప్రజలు గుజరాత్లో బిజెపిని గెలిపించారని ఆయన అన్నారు. భారత రాజకీయ వ్యవస్థ లౌకికతత్వాన్నిదెబ్బ తీసే ప్రయత్నమేదీ వుండదని ఆయన చెప్పారు.
1980 ప్రాంతంలో రథయాత్ర మతహింసకు దారి తీసిందనేది అబద్ధమని చెపుతూ అయోధ్యపై లోతుగా అధ్యయనం చేసిన పోలండ్ రచయిత రథయాత్ర సందర్భంగా ఒక అవాంఛనీయ సంఘటన కూడా జరగలేదని రాశాడని ఆయన గుర్తు చేశారు. హింసకు కారణం అయోధ్య ఉద్యమం కాదు మండల్ కమిషన్ నివేదిక అని ఆయన అన్నారు.