విభేదాలపై పిసిసి ప్రత్యేక కమిటీ
హైదరాబాద్:
పార్టీలో
గ్రూప్
తగాదాలపై,
విభేదాలపైవిచారణకు
ప్రదేశ్
కాంగ్రెస్
కమిటీ
(పిసిసి)
ఒక
ప్రత్యేక
కమిటీని
నియమించింది.
మంగళవారం
జరిగిన
పిసిసి
విస్తృత
స్థాయి
సమావేశంలో
ఈ
మేరకు
ఒక
నిర్ణయం
తీసుకున్నారు.
రాష్ట్రానికి చెందిన ఎఐసిసి కార్యదర్శివి.హనుమంతరావు, ఒబిసి విభాగం అధ్యక్షుడుపి. శివశంకర్ల వ్యవహారంపై ఈ కమిటీ విచారణ జరిపి కేంద్రానికి ఒక నివేదిక సమర్పిస్తుంది.వీరి వ్యవహారంపై మంగళవారం కర్ణాటక వెళ్తూ హైదరాబాద్ బేగంపేటవిమానాశ్రయంలో కొద్దిసేపు ఆగిన సోనియాకు వివరించారు. రాష్ట్రానికి చెందిన ఎఐసిసి నాయకులను కట్టడి చేయాలని కూడా పిసిసి అధిష్ఠానాన్ని కోరనుంది.
పార్టీలోని గ్రూప్ తగాదాలతో, పరస్పర విభేదాలతో పత్రికలకు ఎక్కకుండాసీనియర్ నేతలు సంయమనం పాటించాలని పిసిసి విస్తృతస్థాయి సమావేశం కోరింది.సీనియర్ నేతలు పరస్పరం దూషణలకు దిగడాన్ని ఈ సందర్భంగా ప్రస్తావనకు వచ్చింది. రాష్ట్రానికి వచ్చే ఎఐసిసి నేతలు, ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులు తెలుగుదేశం ప్రభుత్వాన్ని ప్రశంసించకుండా కట్టడి చేయాలని పిసిసి అధిష్టానాన్ని కోరుతుంది.