వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

హిందూశక్తుల పట్ల అప్రమత్తం: సోనియా

By Staff
|
Google Oneindia TeluguNews

కర్వార్‌ (కర్ణాటక): మత ప్రాతిపదికపై సమాజాన్ని విభజించే ప్రయత్నాలు చేస్తున్న భారతీయ జనతా పార్టీ (బిజెపి), సంఘ్‌పరివార్‌ల పట్ల అప్రమత్తంగా వుండాలని కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సోనియా గాంధీ ప్రజలనుకోరారు. కర్ణాటక ప్రభుత్వం అమలు చేస్తున్న పది అభివృద్ధి పనుల ప్రారంభోత్సవ సభలో ఆమె మంగళవారం ప్రసంగించారు.

హిందూత్వ నినాదంతో సమాజాన్ని విభజించడానికి బిజెపి చేస్తున్న ప్రయత్నాలను తిప్పికొట్టాలని ఆమె ప్రజలకు విజ్ఞప్తి చేశారు. వరుసగా మూడేళ్లు కర్ణాటక కరవు బారిన పడిందని ఆమె అంటూ కరువు సహాయ చర్యల కోసం ఆర్థిక సహాయం అందించాలని కేంద్రాన్ని కోరారు.

సుందర ప్రాంతాలున్న ఉత్తర కన్నడ జిల్లాను పర్యాటక కేంద్రంగా తీర్చి దిద్దాలని ఆమె కర్ణాటక ముఖ్యమంత్రి ఎస్‌.ఎం. కృష్ణకు సూచించారు. కర్వార్‌లోని సీబర్డ్‌ నావల్‌ను ప్రాజెక్టును పూర్తి చేయడానికి వెంటనే చర్యలు తీసుకోవాలని ఆమె కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X