రాష్ట్రానికి వచ్చిన కేంద్ర బృందం
హైదరాబాద్:
రాష్ట్రంలో
అమలవుతున్న
కరవు
సహాయక
చర్యలను
అధ్యయనం
చేయడానికి
కేంద్ర
బృందం
మంగళవారం
ఇక్కడికి
వచ్చింది.
ఏడుగురు
సభ్యులతో
కూడిన
ఈ
బృందం
రాష్ట్రంలో
అమలవుతున్న
కరవు
సహాయక
చర్యలను,
కరవు
పరిస్థితులనుఅంచనా
వేస్తుంది.
కేంద్ర బృందం సభ్యులు మంగళవారం రాష్ట్ర ఉన్నతాధికారులతో సమావేశమయ్యారు. రాష్ట్రంలో కరువు సహాయక చర్యలకు 2 వేల కోట్ల రూపాయలు ఇవ్వాలని కోరుతూ రాష్ట్రం ఒక నివేదిక సమర్పించింది. కరువు పరిస్థితులు తీవ్రంగా వుండడంతో పాటు రాష్ట్రంలో తీవ్ర మంచినీటి ఎద్దడి నెలకొన్నదని ఆ నివేదికలో చెప్పారు. కరవు సహాయక చర్యల కోసం కేంద్రం ఇప్పటి వరకు ఇచ్చిన బియ్యం, నిధులు నామమత్రమేనని రాష్ట్రం తెలియజేసింది. కేంద్రం రాష్ట్రానికి 25 లక్షల టన్నుల బియ్యం కేటాయించగా ఇప్పటి వరకు ఆరున్నర లక్షల టన్నులుఅందించిందని, వచ్చే నెలలో మూడున్నర లక్షల టన్నులు రావచ్చునని రాష్ట్రాధికారులంటున్నారు.
కేంద్ర వ్యవసాయ శాఖ సంయుక్త కార్యదర్శిపి.కె. అగర్వాల్ నేతృత్వంలోని కేంద్ర బృందం రెండు బృందాలుగా చీలిపోయి బుధవారం నల్లగొండ, మెదక్ జిల్లాల్లో పర్యటిస్తాయి. గురువారం కేంద్ర బృందం ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడితో సమావేశమవుతుంది.