వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జమ్మూలో ముగ్గురు మిలిటెంట్లు హతం

By Staff
|
Google Oneindia TeluguNews

జమ్మూ: రెండు వేర్వేరు సంఘటనల్లో భారత భద్రతా బలగాలు ముగ్గురుమిలిటెంట్లను హతమార్చాయి. ఇందులో ఇద్దరు లష్కర్‌-ఎ- తోయిబాకు చెందినవారు. ఈ సంఘటనలు జమ్మూ డివిజన్‌లోని దోడా, రాజౌరీ జిల్లాల్లో జరిగాయి.

లష్కర్‌- ఎ- తోయిబాకు చెందిన ఇద్దరు సాయుధమిలిటెంట్లు మంగళవారం సాయంత్రం దోడా జిల్లాలోని ఖాజ్‌వాగ్‌ గ్రామంలోని హజీ మొహమ్మద్‌ సుల్తాన్‌ ఇంటిలోకి చొరబడి భద్రతా బలగాలపై కాల్పులు ప్రారంభించారు. ప్రతిగా భద్రతా బలగాలు జరిపిన ఎదురుకాల్పుల్లో ఇద్దరుమిలిటెంట్లు మరణించారు.

మరో సంఘటనలో రాజౌరీ జిల్లాలోని భీంబేర్‌ గలిసెక్టార్‌లో భారత భద్రతా బలగాలు ఒక మిలిటెంట్‌ను కాల్చి చంపాయి. భారత్‌లోకి చొరబడడానికి ప్రయత్నించినప్పుడు ఈ సంఘటన జరిగింది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X