వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

నీటి మట్టాలపై వాజ్‌పేయి ఆందోళన

By Staff
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: భూగర్భ జలాల మట్టాలు తగ్గిపోతుండడం పట్ల ప్రధాని ఆటల్‌బిహారీ వాజ్‌పేయి తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. భూగర్భ జలాలనువిచక్షణారహితంగా వాడుకోవడాన్ని ఆపాల్సిన అవసరం ఉన్నదని ఆయనఅంటూ ఇందుకు చట్టాలు తేవాలని రాష్ట్రాలకు సూచించారు.

2003ను తాజా జలాల సంతవ్సరంగా ప్రకటించడానికి ఏర్పాటయిన కార్యక్రమంలో ఆయన బుధవారం ప్రసంగించారు. నమూనా భూగర్భ జలాల నియంత్రణ బిల్లుపై వెంటనే చర్యలు తీసుకోవాలని ఆయన రాష్ట్రాలనుకోరారు. జనాభా పెరుగుదల, నాటకీయ జీవన ప్రమాణాలపెరుగుదల వల్ల తాజా జలాలకు డిమాండ్‌ పెరిగిందని, అయితే తాజా జలాలుపెరగలేదని, ఇది తీవ్ర ఆందోళనకరమైనవిషయమని ఆయన అన్నారు.

నదీ జలాల కాలుష్యం ప్రమాదస్థాయికి చేరుకన్నదని, కలుషితమైనందున సంత్‌లుసంగమ్‌లో మునగడానికి ఇష్టపడడం లేదని, పాడుకాలం దాపురించిందనేవిషయాన్ని ఇది తెలియజేస్తున్నదని ఆయన అన్నారు. ప్రముఖ సూఫీ కవి జలాల ప్రాముఖ్యాన్ని చెప్తూ రాసిన కవితలోని పంక్తులను వాజ్‌పేయి ఈ సందర్భంగా ఉటంకించారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X