వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సింగరేణి చర్చల్లో పురోగతి

By Staff
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌: సింగరేణి భవన్‌లో బుధవారం సింగరేణి పరిరక్షణ సమితికి, యజమాన్యానికి జరిగిన చర్చల్లో కొంతపురోగతి కనిపించింది. సింగరేణి పరిరక్షణ సమితి ముసాయిదా ఒప్పందాన్ని యాజమాన్యానికి సమర్పించింది. తమ ముసాయిదా ఒప్పందంపై మంత్రి వర్గఉపసంఘం ప్రతినిధులతో చర్చించడానకి సిద్ధంగా వున్నామని సింగరేణి పరిరక్షణ సమితి నాయకులు చెప్పారు.

ప్రభుత్వం రూపొందించిన ముసాయిదా ఒప్పందాన్ని సింగరేణి కార్మిక సంఘాల నాయకులు తిరస్కరించారు. సర్ఫేస్‌ మైన్స్‌ సమస్యను పక్కనపెట్టి ఇతర కార్మికుల డిమాండ్లపై కార్మిక సంఘాల నాయకులకు, యాజమాన్య ప్రతినిధులకు మంగళవారం జరిగిన చర్చలు ఒక కొలిక్కి రాలేదు.

ఇరు పక్షాల మధ్య బుధవారం తిరిగి చర్చలు ప్రారంభమయ్యాయి. అయితే సర్ఫేస్‌ మైన్స్‌విషయంలో మాత్రం ఇటు ప్రభుత్వం గానీ, అటు కార్మిక సంఘాల నాయకులు గానీ మెట్టు దిగడం లేదు. సర్ఫేస్‌ మైన్స్‌ను ప్రైవేట్‌ కాంట్రాక్టర్లకుఅప్పగించే విషయంలో వెనక్కి తగ్గేది లేదని ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు చెప్పారు. సింగరేణిని ప్రైవేటీకరించనప్పుడు, లాభాలు సాధించడానికి మాత్రమే సర్ఫేస్‌ మైన్స్‌ను కాంట్రాక్టర్లకు అప్పగిస్తున్నప్పుడు, కార్మికుల తొలగింపు ఉండదని ప్రకటించనప్పుడు ఆవిషయంపై కార్మిక సంఘాలు నాయకులు పట్టు పట్టడంలోఅర్థం లేదని ఆయన అన్నారు.

అయితే సింగరేణిని ప్రైవేటీకరించేందుకే సర్ఫేస్‌ మైన్స్‌ను కాంట్రాక్టర్ల చేతుల్లో పెడతున్నారని కార్మిక సంఘాల నాయకులుఅంటున్నారు. ఈ విషయమై తాము వెనక్కి తగ్గేది లేదని వారు చెబుతున్నారు. ఈ పరిస్థితిలో సింగరేణి సమస్యకు పరిష్కారం దొరకడం కొంత దుర్లభంగానే తోస్తోంది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X