వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

నిరసనతో కేంద్ర బృందానికి స్వాగతం

By Staff
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌: కేంద్ర కరువు బృందం వద్ద నల్లగొండ, మెదక్‌ జిల్లాల ప్రజలు నిరసన వ్యక్తం చేశారు. పశుగ్రాసంఅందడం లేదని రైతులు, పని దొరకడం లేదని రైతు కూలీలు, నీటి ఎద్దడి తీవ్రంగా ఉన్నదని మహిళలు కేంద్ర బృందాల వద్ద మొరపెట్టుకున్నారు. కేంద్ర కరువు బృందం రెండుగా విడిపోయి మెదక్‌, నల్లగొండ జిల్లాల్లో బుధవారం పర్యటించాయి.

రాష్ట్రంలోని కరవు పరిస్థితులను పరిశీలించడానికి కేంద్ర వ్యవసాయ, మార్కెటింగ్‌ శాఖ సంయుక్త కార్యదర్శిఅగర్వాల్‌ నేతృత్వంలోని కేంద్రబృందం మంగళవారం ఇక్కడికి వచ్చింది. తమకు ఏ మాత్రం సహాయంఅందడం లేదని ప్రజలు కేంద్ర బృందానికి ఫిర్యాదు చేశారు. మెదక్‌ జిల్లాలోని జిన్నారం, నర్సాపూర్‌, హత్తులూరు మండలాల్లో కేంద్ర బృందం పర్యటించింది. బలవంతంగా బ్యాంకు రుణాలను, కరెంట్‌ బిల్లులను వసూలు చేస్తున్నారని రైతులు చెప్పారు. ఖాళీ బిందెలతో మహిళలు కేంద్ర బృందాన్ని అడ్డుకున్నారు.

నల్లగొండ జిల్లాలోని చౌటుప్పల్‌ మండలంలో మరో బృందం పర్యటించింది. ఈ బృందానికి కూడా ఖాళీ బిందెలతో మహిళల ప్రదర్శన ఎదురయింది. కరువు బృందం వద్ద కాంగ్రెస్‌, తెలంగాణ రాష్ట్ర సమితి, ఇతర ప్రతిపక్షాల కార్యకర్తలు నిరసన ప్రదర్శన చేశారు.

రాష్ట్రంలోని కరువు పరిస్థితులను తగు రీతిలో కేంద్ర ప్రభుత్వానికి నివేదిస్తామని బృందం సభ్యులు హామీ ఇచ్చారు. కరువు ప్రాంతాల ప్రజలకు తమ వంతు సహకారంఅందిస్తామని కూడా వారు చెప్పారు. కేంద్ర బృందం గురువారం ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడును కలుసుకుంటుంది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X