బాబు మిత్రుడు: మోహన్ బాబు
హైదరాబాద్: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో దోస్తీని పునరుద్దరించుకోవడంలో ఎటువంటి ఉద్దేశాలు లేవని హీరో మోహన్ బాబు స్పష్టం చేశారు. చంద్రబాబు నాయుడు తనకు చిన్ననాటి మిత్రుడు అనీ,అందులో మార్పు ఉండదని ఆయన అన్నారు. గురువారం ఉదయం అన్నపూర్ణ స్టూడియోస్ లో జరిగిన తన కుమారుడువిష్ణువర్ధన్ బాబు తొలి సినిమా ప్రారంభోత్సవకార్యక్రమానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ముఖ్య అతిథిగావిచ్చేశారు.
తెలుగు సినిమా పరిశ్రమకు చెందిన ప్రముఖులతో పాటు తెలుగుదేశానికి చెందిన ఎర్రన్నాయుడు వంటి ముఖ్య నేతలు వచ్చారు. అనంతరం జరిగినవిలేకరుల సమావేశంలో మాట్లాడుతూ..చంద్రబాబు నాయుడు ఈ కార్యక్రమానికి రావడం కుటుంబ వ్యవహారమని వ్యాఖ్యానించారు.
నేను నిర్మాతగా నటించిన తొలి చిత్రానికి నా మిత్రుడు చంద్రబాబు నాయుడు కెమెరాస్విఛాన్ చేశారు. అలాగే 20 ఏళ్ళ తర్వాత నా కొడుకును హీరోగా పరిచయం చేస్తోన్న సందర్భంలోసెంటిమెంట్ తో చంద్రబాబుతోనే స్విఛాన్ చేయించానని ఆయనవివరించారు.
అయితే, ఈ విషయంలో ఈ ప్రశ్నలు అడగవద్దని ఆయనవిలేకరులను కోరారు. దీంతో పాటు కాంగ్రెస్ కు చెందిన నేతలు ఎవరూ హాజరుకాకపోవడంవిశేషం.