వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
భారీ ఎత్తున దొంగవీసీడీల స్వాధీనం
హైదరాబాద్: ఒక్క హైదరాబాద్ నగరంలోనే కోట్ల రూపాయలపైరసీ విసీడీల వ్యాపారం జరుగుతోందని పోలీసు ఉన్నతాధికారులు తెలిపారు.
గురువారం నగర టాస్క్ ఫోర్స్ పోలీసులు నగరంలో పలుచోట్ల జరిపిన దాడిలో 14వేలకుపైగా తెలుగు, హిందీ, ఇంగ్లీషు పైరేటెడ్ వీసీడీలు లభించాయి. దాదాపు 25 లక్షల రూపాయలవిలువ చేసే ఈ వీసీడీలను పోలీసులు స్వాధీనపర్చుకున్నారు.
ముంబై, చెన్నై ప్రధాన కేంద్రాలుగా ఈపైరసీ ముఠాలు పనిచేస్తున్నాయని నగర అదనపు పోలీసు కమీషనర్ తెలిపారు. ఈ దాడిలోఅరెస్ట్ చేసిన వీసీడీ వ్యాపారస్థులను విచారించి..ముఠా కలాపాలను అడ్డుకుంటామన్నారు. ముంబై - చెన్నైల తర్వాత హైదరాబాద్పైరసీ కేంద్రంగా మారిందన్నారు.
Comments
Story first published: Thursday, February 6, 2003, 23:53 [IST]