వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
అంతర్రాష్ట్ర దొంగల ముఠా అరెస్టు
విశాఖపట్నం:
వాహనాల
అంతర్రాష్ట్ర
దొంగల
ముఠా
సభ్యులనువిశాఖపట్నం
పోలీసులు
అరెస్టు
చేశారు.
ద్విచక్రవాహనాలను,
కార్లనుపెద్ద
యెత్తున
దొంగిలించి
రిజిస్ట్రేషన్
పత్రాలను
మార్చేసి
ఈ
ముఠావిక్రయిస్తూ
వస్తోందని
పోలీసులు
చెప్పారు.
ముఠాకు చెందిన ఎనమండుగురిని పోలీసులుఅరెస్టు చేశారు. మరో ఎనమండుగురి కోసం గాలిస్తున్నారు. కరీంనగర్ జిల్లా గోదావరిఖనికి చెందినషేర్ అక్రమ్ నేతృత్వంలో ఈ దొంగతనాలు జరుగుతున్నట్లు పోలీసులు చెప్పారు.విశాఖపట్నం ఆర్టిఎ కార్యాలయం క్లర్కు, ఒక ఏజెంట్ దగ్గర పని చేస్తున్నఈశ్వర్ల సహకారంతో ట్రాన్స్ఫర్ రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్లు సృష్టించి దొంగతనం చేసిన వాహనాలను అనుమానం రాకుండావిక్రయిస్తూ వస్తున్నారని వారు వివరించారు. అరెస్టయిన ఎనమండుగురిలో ఆరుగురువిశాఖపట్నానికి చెందినవారు.
Story first published: Friday, February 7, 2003, 23:53 [IST]